Thalliki vandanam Latest Release Date : తల్లికి వందనం విడుదల తేదీలు ఫిక్స్ మీకు డబ్బులు పడాలంటే వెంటనే ఇలా చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి పేద మరియు మధ్యతరగతికి చెందినటువంటి విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతుంది ఈ నెల అనగా జులై 22వ తేదీన మొదటి విడత అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 24వ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది. జూలై 25 వ తేదీ లోపు ఈ తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులకైతే పూర్తిగా అమౌంట్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా వచ్చేసి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 13 వేల రూపాయలు విద్యార్థి యొక్క తల్లి లేదా సంరక్షకుని యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.
ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ స్కీం కొరకు 10,120.78 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి 13 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే స్కూలుకు సంబంధించినటువంటి టాయిలెట్లు మరియు అదే విధంగా ఇతర శుభ్రత కార్యక్రమాలకు 2000 రూపాయలు అదనంగా అయితే ఇవ్వడం జరుగుతుంది.
తల్లికి వందనం డబ్బులు పడాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి.
- తల్లికి వందనం డబ్బులు పడాలంటే ముందుగా విద్యార్థి వచ్చేసి గుర్తింపు పొందినటువంటి ఏదో ఒక పాఠశాల లేదా కళాశాలలో అడ్మిషన్ పొంది ఉండాలి.
- అలాగే విద్యార్థి యొక్క సంవత్సర హాజరు శాతం అనేది 75% పైన ఉండాలి
- విద్యార్థి వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పక్క యాడ్ అయ్యి ఉండాలి.
- విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నెల ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి 12 వేల రూపాయలు అయితే ఉండాలి. దీనికి మించి ఆదాయం ఉంటే వీరు వచ్చేసి తల్లికి వందనం ఇన్ ఎలిజిబుల్ లిస్టులో అయితే ఉంటారు.
- అలాగే ఎవరైతే విద్యార్థి ఉంటారో వారి యొక్క తల్లి ఆధార్ బ్యాంకుకు సీడింగ్ అయి ఉండాలి అదేవిధంగా ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి ఎన్పీసీఐ లింకింగ్ కూడా కంప్లీట్ అయి ఉండాలి.
తల్లికి వందనం డబ్బులు ఎవరికి మరియు ఎంత వేస్తారు.
తల్లికి వందనం డబ్బులు అనేవి ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 13వేల రూపాయలు అయితే పడడం జరుగుతుంది అదే విధంగా ఒక ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. అలాగే వీరితోపాటు అనాధ మరియు వీధులలో ఉండేటటువంటి పిల్లలకు కూడా ఈ సంవత్సరం డబ్బులు కేటాయించాలని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరికి సంబంధించిన డబ్బులు అనేది వారు ఉంటున్నటువంటి ఆర్ఫనైజ్కైతే ఇవ్వడం జరుగుతుంది.
తల్లికి వందనం డబ్బులు కొత్తగా పాఠశాల అడ్మిషన్ తీసుకునేటటువంటి పిల్లలకు వర్తిస్తుందా?
తల్లికి వందనం డబ్బులు వచ్చేసి కొత్తగా పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నటువంటి ఒకరికి అయితే వర్తిస్తుంది అయితే ఈ అడ్మిషన్ అనేది ఆగస్టు 25వ తేదీలోపు ఒకటవ తరగతి అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.
తల్లికి వందనం లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.
తల్లికి వందనం లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి నేను కింద చూపించినటువంటి లింక్ ను ఓపెన్ చేసి అలాగే నేను చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి సింపుల్ గా మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
Talliki Vandanam status Link
Online ద్వారా చెక్ చేసుకునే విధానం:
Step 1: ముందుగా AP Grama Ward Sachivalayam (GSWS) Application Status Portal లేదా Navakam Portal ను ఓపెన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో “Thalliki Vandanam Eligibility Status Check” అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
Step 3: అక్కడ కనిపించే బాక్స్లో తల్లి Aadhaar Number ను నమోదు చేయండి.
Step 4: తర్వాత “Get OTP” లేదా “Send OTP” బటన్పై క్లిక్ చేయండి.
Step 5: ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన OTP ను నమోదు చేసి “Verify OTP” పై క్లిక్ చేయండి.
Step 6: వెరిఫికేషన్ పూర్తైన వెంటనే మీ Eligibility Status, Sanction Status, Payment Status మరియు ఇతర వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
Method 2 : WhatsApp ద్వారా చెక్ చేసుకునే విధానం:
Step 1: మీ మొబైల్లో +91 95523 00009 నంబర్ను “AP Government WhatsApp” పేరుతో సేవ్ చేయండి.
Step 2: ఆ నంబర్కు WhatsAppలో “Hi” అని మెసేజ్ పంపండి.
Step 3: తర్వాత కనిపించే సేవల జాబితాలో “Thalliki Vandanam” లేదా సంబంధిత సేవను ఎంచుకోండి.
Step 4: అవసరమైన చోట Aadhaar Number లేదా అడిగిన వివరాలను నమోదు చేయండి.
Step 5: వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ Eligibility, Sanction మరియు Payment Status వివరాలు WhatsAppలోనే చూపించబడతాయి.
గమనిక:
- Aadhaar కు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
- OTP నమోదు చేసిన తర్వాత మాత్రమే స్టేటస్ను చూడగలుగుతారు.
- వివరాలు కనిపించకపోతే కొంత సమయం తర్వాత మళ్లీ చెక్ చేయండి లేదా సమీప Grama/Ward Sachivalayam ను సంప్రదించండి.
తల్లికి వందనంకు సంబంధించి ఇతర ప్రశ్నలు:
1) తల్లికి వందనం డబ్బులు ఒక కుటుంబంలో ఎంతమందికి పడుతుంది?
జవాబు : తల్లికి వందనం డబ్బులు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంతమంది పిల్లలు ఉంటారో వారి అందరికీ ఈ అమౌంట్ అయితే పడడం జరుగుతుంది.
2) ఒకటవ తరగతి విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడుతుందా లేదా?
జవాబు : తల్లికి వందనం డబ్బులు వచ్చేసి ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందేటటువంటి విద్యార్థులకు కూడా పడుతుంది కాకపోతే మీరు ఆగస్టు 25వ తేదీ లోపు పిల్లలు యొక్క అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
3) తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం అనేది ఎంత ఉండాలి?
జవాబు : తల్లికి వందనం డబ్బులు పడాలంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు వచ్చేసి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల సంపదకు మించి ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి నెలకు 12 వేల రూపాయల ఆదాయం అయితే మించి ఉండకూడదు.
4) పదవ తరగతి అయిపోయిన టువంటి వారికి కూడా తల్లికి వందనం డబ్బులు పడుతుందా?
జవాబు: తల్లికి వందనం డబ్బులు పదవ తరగతి అయిపోయిన వారికి కూడా పడుతుంది కాకపోతే వీరు ఇంటర్మీడియట్ కాలేజీల్లో వచ్చేసి అడ్మిషన్ పొంది ఉండాలి. ఈ డబ్బులు వచ్చేసి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వర్తిస్తుంది.
5) తల్లికి వందనం కి సంబంధించి మరింత సమాచారం కొరకు ఎక్కడికి వెళ్లాలి?
జవాబు: తల్లికి వందనం పతంకాంగ్ సంబంధించి ఇంకా ఏవైనా సలహాలు సందేహాలు ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయం సంప్రదించి మీ యొక్క సలహాలకు పరిష్కారాలనైతే తెలుసుకోవచ్చు.




