jagananna-vidya-deevena-tekugu

Jagananna Vidya Deevena Scheme in Telugu

Jagananna Vidya Deevena Scheme in Telugu

జగనన్న విద్య దీవెన పథకము :

పథకం యొక్క ఉద్దేశం:

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించడం.

ప్రయోజనాలు:

  1. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ,బీఈడీ వంటి కోర్సులు చదువుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులు అయిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అందించడం.
  2. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చడం.

అర్హతలు:

  1. పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటిఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులను ప్రభుత్వ గుర్తింపు కలిగిన కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
  2.  విద్యార్థులు 75 శాతం హాజరుని తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ కోవిడ్ కారణంగా గడిచిన విద్యాసంవత్సరానికి హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
  3.  కుటుంబ వార్షిక ఆదాయం 2.50 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.
  4.  కుటుంబానికి వ్యవసాయ భూమి పరిమితి మాగాణి అయితే 10 ఎకరాల లోపు, మెట్ట అయితే 25 ఎకరాల లోపు లేదా రెండు కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు.
  5.  పట్టణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగులు కన్నా తక్కువ బిల్డప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం ) కలిగిన కుటుంబం ఈ పథకానికి అర్హులు.
  6. ఆదాయం తో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
  7. టాక్సీ, ఆటో, ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్న కుటుంబాల వారికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు.

 అనర్హతలు:

  1. ప్రభుత్వ సూచనల మేరకు వార్షిక ఆదాయ పరిమితి, భూమి పరిమితి కన్నా ఎక్కువగా ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
  2. కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ/ ఆదాయ పన్ను చెల్లింపుదారులు కానీ/ పదవి విరమణ పొంది పెన్షన్ పొందే వ్యక్తి కానీ అయి ఉండరాదు. ( పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు కలదు)
  3. డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలకు ఈ పథకం వర్తించదు.
  4. దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్ మెంట్, ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తించదు.

కావలసిన పత్రాలు:

  • బ్యాంక్ ఖాతా పుస్తకం
  • ఆధార్ కార్డు
  • కుల దృవీకరణ పత్రం
  • రెవిన్యూ శాఖ నుండి ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రెసిడెన్షియల్ సర్టిఫికెట్
  • కాలేజీ అడ్మిషన్ సర్టిఫికెట్
  • అడ్మిషన్ ఫీజు రిసిప్ట్
  • BPL లేదా EWS సర్టిఫికెట్
  • తల్లిదండ్రుల వృత్తి ధ్రువీకరణ పత్రం
  • ఉద్యోగులు అయితే నాన్ ట్యాక్స్ పేయర్ డిక్లరేషన్

2021- 22 ఆర్థిక సంవత్సరానికి గానూ జగనన్న విద్యా దీవెన 2వ విడత విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :

  • 5 – జూలై – 2021 : తాజాగా నవీకరించిన డేటాబేస్ తో జ్ఞానభూమి(APCFSS) సాంకేతిక బృందం వారు జగనన్న విద్యా దీవెన దరఖాస్తులను ఆరు దశల దృవీకరణ నిర్వహిస్తారు.
  • 6- జూలై – 2021: WEA/WES లాగిన్ లలో అనర్హుల జాబితాను ప్రదర్శిస్తారు.
  • 6-12 జూలై – 2021 : ఆరు దశల ధృవీకరణతో అనర్హుల దరఖాస్తులను గుర్తిస్తారు.
  • 3-10 జూలై – 2021 :  WEA లు/WES లు లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ ని మరియు తల్లుల నుండి ఎలక్ట్రానిక్ అక్నాలెడ్జ్మెంట్ ని సేకరిస్తారు.
  • 3-10 జూలై – 2021 : కళాశాలలకు రుసుము చెల్లించకపోవడానికి కారణాలను విశ్లేషిస్తారు. అలానే సకాలంలో ఫీజులు చెల్లించేలా సంబంధిత తల్లులకు ప్రేరణ కల్పిస్తారు.
  • 13 జూలై – 2021 : సచివాలయాలలో జగనన్న విద్యా దీవెన రెండవ విడత ఫీజుల చెల్లింపు కి సంబంధించిన అర్హుల మరియు అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు.
  • 14-15  జూలై – 2021 : సామాజిక ఆడిట్ ( సోషల్ ఆడిట్) లో భాగంగా జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
  • 16 జూలై – 2021 : ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ లాగిన్ కి WEA/WES అభ్యంతరాలపై వివరణాత్మక  వ్యాఖ్యలను పంపడం జరుగుతుంది.
  • 16 జూలై – 2021 : క్షేత్ర దృవీకరణ నిర్వహించిన తరువాత మరియు సమర్థవంతమైన కారణాలతో ఎంపీడీవోలు మరియు మునిసిపల్ కమిషనర్ అభ్యంతరాలను తొలగించడం.
  • 22 జూలై – 2021 : APCFSS ద్వారా అర్హత గల విద్యార్థుల బిల్లుల విడుదల.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top